ఆరోగ్యం బాలేదని అంబులెన్స్‌కు కాల్‌ చేసి..

లక్నో : లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  ప్రజలు బయటకు వెళ్లేందుకు రక రకాల ప్లాన్లు వేస్తూ చివరికి పోలీసులకు చిక్కిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు అంబులెన్స్‌ ను అడ్డుగా వాడుకుని  ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. చివరికి విషయం పోలీసులకు తెలియడంతో పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్‌కు వెళ్లారు. (చదవండి : ‘కొట్టు’కెళ్లి కోడ‌లిని ప‌ట్టుకొచ్చాడు)



పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన అహ్మద్‌కు ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ యువతికితో యువతితో  వివాహం నిశ్చయమైంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా యువకుడు, అతని తండ్రి ముజఫర్‌నగర్‌లోనే చిక్కుకుపోయారు. పెళ్లి రోజు దగ్గరపడడంతో ఇద్దరు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. నాలుగు రోజుల క్రితం ముజఫర్‌నగర్‌ నుంచి బయలుదేరి మార్లమధ్యలో పోలీసులకు చిక్కారు. దీంతో వారిని తిరిగి ఇంటికి పంపించారు.